బ్రేకింగ్: లోకేష్ పాదయాత్రలో మరో అపశృతి.. గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: లోకేష్ పాదయాత్రలో మరో అపశృతి.. గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుండగా.. పాదయాత్ర బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ రమేష్ గురువారం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు, కార్యకర్తలు హెడ్ కానిస్టేబుల్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. జనవరి 27వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తారకరత్నను బెంగళూరుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. లోకేష్ పాదయాత్ర బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి చెందడం కలకలం రేపుతోంది.

Read more:

అన్నతోనే ఉంటా.. సస్పెన్స్‌కు తెరదించిన తమ్ముడు కృష్ణుడు

పునరాగమనంలో మ్యాజిక్ స్పిన్‌తో రఫ్ఫాడించిన జడేజా.

Next Story

Most Viewed