TulasiReddy: మహిళకు 18 మంది భర్తలా?.. బోగస్ ఓట్లపై ఆగ్రహం

by Disha Web Desk 16 |
TulasiReddy: మహిళకు 18 మంది భర్తలా?.. బోగస్ ఓట్లపై ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో బోగస్ ఓట్లను సృష్టిస్తోందని ఆరోపించారు. బోగస్ ఓట్లను పరిశీలిస్తే ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ‘అంతేకాదు ఒకే మహిళకు18 మంది భర్తలట... ఇది కాలమహిమా? లేక కలి మాయా? లేక జగన్ మాయా?’ అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన జగన్ మాయ అని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో వెళ్తోందని విరుచుకుపడ్డారు. ఈ బోగస్ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed