దివ్యాంగురాలు హత్యపై నేషనల్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

by sudharani |
దివ్యాంగురాలు హత్యపై నేషనల్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాడేపల్లిలో దివ్యాంగురాలు ఎస్తేర్ రాణి హత్యపై నేషనల్ ఎస్సీ కమిషన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తాడేపల్లి క్రైం హబ్ గా మారిపోయిందని లేఖలో ఆరోపించారు. తాడేపల్లిలో సీఎం నివాసం, డీజీపీ ఆఫీసులు ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువయ్యింది అని చెప్పుకొచ్చారు. డ్రగ్స్‌తో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ఉదాసిన వైఖరితో తాడేపల్లిలో గతంలో అనేక దారుణమైన సంఘటనలు జరిగాయి అని లేఖలో గుర్తు చేశారు. 'ఫిబ్రవరి 12 న నిందితుడు దివ్యాంగురాలు ఎస్తేర్ రాణిని చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలి తల్లి నిందితుడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతలోనే రాజు దివ్యాంగురాలిపై దాడిచేసి తలపై కత్తితో నరికాడు.

హాస్పిటల్‌కు తీసుకెళ్లే క్రమంలో దివ్యాంగురాలు మృతిచెందింది. నిందితుడు రాజు నేరచరిత్ర ఉన్నవాడు. పోలీసుల ఉదాసీన వైఖరే దివ్యాంగురాలి హత్యకు కారణం. నిందితుడు రాజు డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో ఆరోపించారు. 'డ్రగ్స్ దందాపై అనేక మార్లు పిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దివ్యాంగురాలిని అత్యంత దారుణంగా హతమార్చిన రాజుపై కఠిన చర్యలు తీసుకోండి. ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ నిషేదం పై చర్యలు తీసుకునేలా కమీషన్ ఆదేశించండి. డ్రగ్స్ ప్రభావంతో మహిళలపై జరిగిన నేరాలపై సమగ్ర విచారణ చేయించండి. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఖూనీ చేస్తూ తప్పుడు మార్గంలో నడుస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోండి' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో కోరారు.

Next Story

Most Viewed