ప్రసన్నకుమార్ రెడ్డిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

వైసీపీ మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డిపై మ‌హిళా క‌మిష‌న్‌‌కు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి

ప్రసన్నకుమార్ రెడ్డిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డిపై మ‌హిళా క‌మిష‌న్‌‌కు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవని అర్థమవుతోంది. ఇక కూటమి నేతలు ప్రశాంతి రెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రసన్న కుమార్ తీరును ఖండిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రసన్న కుమార్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

Next Story