ఏపీలో భారీ వర్షాలు.. బాధితులకు రూ. 2 వేలు, రేషన్

by Disha Web Desk 16 |
ఏపీలో భారీ వర్షాలు.. బాధితులకు రూ. 2 వేలు, రేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాండూస్‌ తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తుపానుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించండని. ఎక్కడా కూడా రైతులు నిరాశకు గురికాకూడదని సూచించారు. రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదన్నారు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదని, ఒకవేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే కూడా వారికి రావాల్సిన రేటు వారికి రావాలని సూచించారు. ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదని, వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


బాధితులందరికీ న్యాయం చేయాలి

'తుపాను నేపథ్యంలో పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలి. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే ఆ కుటుంబానికి రూ.2వేల రూపాయలతోపాటు, రేషన్‌ అందించాలి. ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదని సూచించారు. నీళ్లు ఇంటిలోకి వచ్చి ఉంటే కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందేనని ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలి'. అని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 'పట్టణాలు,పల్లెలతో సంబంధం లేకుండా ఈ సహాయాన్ని బాధితులందరికీ అందించాలి. గోడకూలి ఒకరు మరణించారన్న ఘటన జరిగినట్టుగా సమాచారం వచ్చింది. వారికి కూడా పరిహారం వెంటనే అందించాలి. వారంరోజుల్లో ఈ సహాయం అంతా వారికి అందాలి. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే వారికి కూడా పరిహారం సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలి. వచ్చే వారం రోజుల్లో ప్రక్రియ ముగించాలి.' అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి : ఐదేళ్లు ఆశగా ఎదురు చూశారు.. గట్టిగా డిమాండ్ చేయడంతో అరెస్ట్



Next Story

Most Viewed