- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ లక్షణాలు ఉంటేనే వైఎస్ వారసులు అవుతారు: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భారీ సభను ఏర్పాటు చేశారు. వైజాగ్ వేదికగా విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు ఆయన ఆశయాలను నేరవేర్చాలి.. కానీ సీఎం జగన్ అలా చేయడం లేదని వైఎస్ ఆశయాలను, సంకల్పాన్ని నిలబెట్టలేకపోతున్నారని జగన్ పై విమర్శలు చేశారు.
అలాగే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆశయాలను మర్చిపోయాడని.. అతను ఎలా వైఎస్ వారసుడు అవుతాడని ప్రశ్నించారు. ఏపీలో ప్రశ్నించే గొంతుక ఉంటేనే పాలకులు మన మాట వింటారని.. ఏపీలో ప్రశ్నించే నాయకుడు లేకనే మోడీ ఏపీనీ పట్టించుకోవడం లేదని.. ఇక్కడి నాయకులు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విశాఖ సభలో ఫైర్ అయ్యారు.
Read More..