కాసేపట్లో అమల్లోకి కొత్త జీఎస్టీ విధానం.. బుక్‌లెట్‌ ఆవిష్కరణ

by Vemula.Srinu Prasad |

కొత్త జీఎస్టీ విధానంపై సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా బుక్‌లెట్‌‌ను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు...

కాసేపట్లో అమల్లోకి కొత్త జీఎస్టీ విధానం..  బుక్‌లెట్‌ ఆవిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానంపై సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా బుక్‌లెట్‌‌ను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్ర పన్నుల విధానంపై అధికారులతో ఆయన సమీక్షించారు. చాలా వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గిందని తెలిపారు. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్ను తగ్గిందని చెప్పారు. అలాగే, పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించిందని పేర్కొన్నారు.

ఏపీ సీఎమ్‌వో ట్వీట్..

Next Story