ఢిల్లీ పార్లమెంట్ వద్దకు సీఎం జగన్.. ప్రధాని మోడీ కోసం వెయిటింగ్ (వీడియో)

by Disha Web Desk 16 |
AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అమరావతి నుంచి ఈ ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. మోడీ వచ్చిన వెంటనే కొంతసేపు భేటీ అవుతారు. ఏపీకి ప్రత్యేక హొదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయాన్ని మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్తారు. అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ అవుతారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆమెతో చర్చిస్తారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్, రాష్ట్రంలో విడుదలైన పలు సర్వేల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.



Next Story