పార్టీ ముఖ్యనేతలతో Cm Jagan సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

by srinivas |
పార్టీ ముఖ్యనేతలతో Cm Jagan సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు పెంచారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. స్థానిక సంస్థల కోటాలో రామసుబ్బారెడ్డి, వంకా రవీంద్ర, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఎమ్ జియా ఉద్దీన్, నవీన్ నిశ్చల్, జయమంగళ వెంకట రమణ, కుడిపూడి సూర్యనారాయణ, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రామచంద్రారెడ్డి, పర్వత చంద్రశేఖర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సుధాకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వెన్నుపూస రవీంద్రారెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సామాజిక వర్గాలుగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Next Story