Delhi: సీఎం జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

by Disha Web Desk 16 |
Delhi: సీఎం జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది. విశాఖ మర్రిపాలెంలో వ్యాపారి లలితేశ్ కుమార్‌కు చెందిన 17,135 చ.మీటర్ల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో నెం.115‌ను జారీ చేసింది. అయితే ఈ జీవోపై వ్యాపారి లలితేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 115 జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును గతంలోనే హైకోర్టు సీజే ధర్మాసనం సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వమే స్థలం ఇచ్చి వెనక్కి తీసుకుంటుందా అని ప్రశ్నించింది.

Also Read..

Amaravati: ఏపీపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి కేంద్రం పెద్దలు


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story

Most Viewed