బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.. కాకినాడ సభలో సీఎం జగన్ సెటైర్లు

by Disha Web Desk 16 |
బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.. కాకినాడ సభలో సీఎం జగన్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి విమర్శలు కురిపించారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ‘జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్త పుత్రుడు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా చంద్రబాబునే నిర్ణయిస్తారు. గ్లాజు గ్లాస్‌తో తాగేది చంద్రబాబునే. దాన్ని శుభ్రం చేసి మళ్లీ చంద్రబాబుకు ఇచ్చేది ప్యాకేజీ స్టారే. బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే. చంద్రబాబును ముఖ్యమంత్రినే చేసేందుకే పురంధేశ్వరి పని చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. అందుకే నాపై గులకరాళ్లు వేయించారు. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది. కాపు నేస్తం కొనసాగుతుంది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే మంచి జరుగుతుందో వారికే ఓటు వేయండి. గత ఎన్నికల్లో మాకు కొంతమంది ఓటు వేయలేదు. కాని వివక్ష లేకుండా వారికి కూడా పథకాలు అందించాం. రాష్ట్రాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ప్రజలు నమ్మొద్దు.’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed