గవర్నర్ కాళ్లు మొక్కిన సీఎం జగన్

by Malleboina Mahesh |

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

గవర్నర్ కాళ్లు మొక్కిన సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన హరిచందన్ నేడు బాధ్యతలు చేపట్టేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో గవర్నర్ దంపతులుకు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడ్కోలు పలికారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Next Story