సీఎం జగన్, వైఎస్ఆర్ బొమ్మలతో గెలవాల్సిందే: మంత్రి ఆదిమూలపు సురేశ్

by Disha Web Desk 21 |
సీఎం జగన్, వైఎస్ఆర్ బొమ్మలతో గెలవాల్సిందే: మంత్రి ఆదిమూలపు సురేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 175 నియోజకవర్గాల్లో ఎవరైనా సరే సీఎం జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మలతో గెలవాల్సిందే అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. 175 స్థానాల్లో విజయం సాధించాలంటే తప్పకుండా తగిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని అందులో భాగంగానే ఇన్‌చార్జిల మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అన్నారు. మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో మార్పులపై ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ఒంగోలులో శుక్రవారం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండెపి నియోజకవర్గంలోకూడా వైసీపీ జెండా ఎగురేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు పార్టీలో మార్పుల సహజం అలాంటి వాటిపై టీడీపీ అనవసరమై రాద్ధంతం చేస్తుందని మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పంకు ఎందుకు మారారని నిలదీశారు. ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలి అని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు.



Next Story

Most Viewed