సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో భారత్(India), పాకిస్తాన్(Pakistan) మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి కేంద్రానికి ఏపీ సంఘీభావం పై గవర్నర్‌తో ఏపీ(Andhra Pradesh) సీఎం(CM Chandrababu) చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో తిరుపతి(Tirupati), విశాఖ(Visakhapatnam) లాంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ చర్యలపై సీఎం చంద్రబాబు గవర్నర్‌కు (Governor Abdul Nazir) వివరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌(Hyderabad)లో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి(Amravati)కి చేరుకోనున్నారు.



Next Story

Most Viewed