సింగపూర్ పర్యటన విజయవంతంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2025-07-30 15:20:18  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఈ రోజు రాత్రి ఏపీ బయలుదేరనున్నారు.

సింగపూర్ పర్యటన విజయవంతంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఈ రోజు రాత్రి ఏపీ బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు.. తెలుగు ప్రజలతో పాటు.. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే సింగపూర్ పర్యటన (Singapore Tour) విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ (Interesting tweet) చేశారు. అందులో "సింగపూర్ పర్యటన విజయవంతం అయింది. ఈ పర్యటనలో.. ప్రభుత్వ నాయకులు, పరిశ్రమల నాయకులు, భారత ప్రవాసులతో ఉత్పాదక సమావేశాలు సహా 27కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నాను.

సింగపూర్‌తో మా లోతైన సంబంధాలను పునరుద్ధరించడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. భారతదేశం-సింగపూర్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. ఈ పర్యటన అంతటా, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రదర్శించడానికి మరియు మన రాష్ట్రం అందించే విస్తారమైన పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడానికి నాకు అవకాశం లభించింది. సింగపూర్ విలువైన భాగస్వామిగా ఉంది మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అర్థవంతమైన సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను." అని సీఎం చంద్రబాబు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story