- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వే చేస్తున్నాం.. వాళ్లను వదిలించుకుంటాం: సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్టీ క్లస్టర్ ఇంచార్జులతో భేటీ అయిన ఆయన పదవులు, టికెట్ల కేటాయింపుపై సర్వే చేస్తున్నామని, తప్పులు చేసిన వాళ్లను వదిలించుకుంటామని స్పష్టం చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి(Amaravati)లో పార్టీ క్లస్టర్ ఇంచార్జుల(Party Cluster Incharges)తో భేటీ అయిన ఆయన పదవులు, టికెట్ల కేటాయింపుపై సర్వే చేస్తున్నామని, తప్పులు చేసిన వాళ్లను వదిలించుకుంటామని స్పష్టం చేశారు. నేతలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. డీఎస్సీ(DSC)పై వైసీపీ(Ycp) నాయకులు దుష్ప్రచారం చేశారని, వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో గొడ్డలి పార్టీ ఖంగుతిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Next Story






