SIPB భేటీలో కీలక నిర్ణయం..లోకేశ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

SIPB భేటీలో కీలక నిర్ణయం..లోకేశ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో ఆయన (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రులు టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, సుభాశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించారు.


ఈ భేటీలో వివిధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో పోర్టల్ ఏర్పాటు చేయాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే ఉత్పత్తి మొదలు పెడితేనే లక్ష్యం చేరినట్లవుతుందని తెలిపారు. ఐటీ సంస్థలకు నామ మాత్రపు ధరకే భూ కేటాయింపులు ఉంటాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పెట్టుబడుల సాధన కనిపించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story