- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. పార్టీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ(Telugudesam Party)ని మరింత బలోపేతం సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఫోకస్ పెట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయంసాధించేలా పార్టీని రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కమిటీ(TDP committee)లను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు కమిటీల నియమకాలు జరిగాయి. మరికొన్ని కమిటీలను ప్రస్తుతం నియామకాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పార్టీ కమిటీలను మొత్తం భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు తాజాగా పార్టీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు(Suparipalanalo Toli Adugu) కార్యక్రమం నిర్వహణతో పాటు టీడీపీ కమిటీల నియామకంపై చర్చించారు. ఈ నెలాఖరు వరకు కమిటీల నియామకం పూర్తి చేయాలని సూచించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి నేతలే గెలవాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.






