Swachh Survekshan Awards: ఆ కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-12 16:04:30  IST  )

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన ఐదు నగరాల కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందించారు...

Swachh Survekshan Awards:  ఆ కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రికి స్వచ్ఛ సర్వేక్షణ్(SWACHH SURVEKSHAN) అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నగరాలకు అవార్డులు రావడానికి కారణమైన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. ‘

‘2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో AP మెరిసే పని తీరు కనబరిచింది. ఇందుకు కారణమైన మున్సిపల్ శాఖ, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, పారిశుధ్య కార్మికులు, పౌరులకు అభినందనలు. విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రతిష్టాత్మక సూపర్ స్వచ్ఛ లీగ్‌లో చేరాయి. విశాఖపట్నం (GVMC) మినిస్టీరియల్ అవార్డు (స్పెషల్ కేటగిరీ) గెలుచుకుంది. రాజమండ్రి మినిస్టీరియల్ అవార్డు (రాష్ట్ర స్థాయి) అందుకుంది. రాష్ట్ర ప్రజల సమిష్టి కృషి వల్ల ఈ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర మిషన్ ప్రభావాన్ని మరింత హైలైట్ చేస్తాయి.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

సీఎం ట్వీట్ కోసం లింక్ క్లిక్ చేయండి....

Next Story