- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11న సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మంత్రులు, కార్యదర్శులతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

దిశ, డైనమిక్బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులతో పాలన అంశాలపై చర్చిస్తారు. సీఎం అధ్యక్షతన రెండు సెషన్లుగా సమావేశం జరగనుంది. తొలి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్డీపీపై చర్చిస్తారు. వాట్సప్గవర్నెన్స్, మిషన్ కర్మయోగిపై కూడా చర్చించనున్నారు. త్వరలో ప్రవేశ పెట్టబోయే ఏపీ బడ్జెట్పై రెండో సెషన్లో చర్చించనున్నారు. చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047పై అంశాలపై కూడా చర్చిస్తారు. తమకు సంబంధించిన శాఖలకు ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం లోగా రెండు ప్రజెంటేషన్లు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజెంటేషన్లు ఉండాలని ఆదేశించారు. ప్రజెంటేషన్ నిడివి 15 నిమిషాలు ఉండాలని సీఎస్ఆదేశాలు జారీ చేశారు.






