- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Elections: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. నేతలకు కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాలకు త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(Graduate MLC Elections) జరగనున్నాయి. ఈ మేరకు పట్టభద్రుల ఓటు నమోదు(Vote registration) కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల టీడీపీ ఎంపీలు(TDP MPs), ఎమ్మెల్యేలు(Mlas), ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. జనసేన(Janasena), బీజేపీ(Bjp)తో కలిసి ముందుకెళ్లాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు
Next Story






