- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: మన్యం జిల్లాలో కొనసాగుతోన్న నిరవధిక బంద్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayanna Pathrudu) చేసి వ్యాఖ్యలపై గిరిజన సంఘాలతో పాటు అఖిలపక్ష ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

దిశ, వెబ్డెస్క్: పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayanna Pathrudu) చేసి వ్యాఖ్యలపై గిరిజన సంఘాలతో పాటు అఖిలపక్ష ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District)లోని ఏజెన్సీతో పాటు మరికొన్ని గిరిజన తెగలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 48 గంటల నిరవధిక బంద్ (Indefinite Bandh)కు పిలుపునిచ్చారు. అయితే, ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) కూడా తన మద్దతును ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి బంద్ ప్రకటించిన ప్రాంతాల్లో కొంతమంది తమ షాపులను స్వచ్ఛదంగా మూసివేశారు. జిల్లా కేంద్రం పాడేరు (Paderu)లోని ప్రధాన రహదారుల్లో నడుస్తున్న వాహనాలను సైతం గిరిజన సంఘాల నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు బంద్ నేపథ్యంలో అక్కడి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Seetharamaraju District) కొనసాగుతోన్న నిరవధిక బంద్పై తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా చేశామని గుర్తు చేవారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దు అయిందని, మళ్లీ ఆ జీవో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలోని గిరిజనులు ఈ విషయంలో అనవసర అపోహలుతో ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






