జిల్లాల పునర్‌ విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

by Ajay Maddhiboyina |

జిల్లాల పున‌ర్ విభ‌జ‌న‌పై సీఎం చంద్ర‌బాబు కీల‌క స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుపై స‌మీక్ష‌లో కేబినెట్ స‌బ్ క‌మిటీతో చంద్ర‌బాబు చ‌ర్చిస్తున్నారు. మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లెతో పాటు రంప‌చోడ‌వ‌రం జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

జిల్లాల పునర్‌ విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: జిల్లాల పున‌ర్ విభ‌జ‌న‌పై సీఎం చంద్ర‌బాబు కీల‌క స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుపై స‌మీక్ష‌లో కేబినెట్ స‌బ్ క‌మిటీతో చంద్ర‌బాబు చ‌ర్చిస్తున్నారు. మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లెతో పాటు రంప‌చోడ‌వ‌రం జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు, చేర్పుల‌పై దృష్టి పెట్టాల‌ని సీఎం సూచించారు. స‌మావేశంలో కొత్త రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటుపైనా చ‌ర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే చంద్ర‌బాబు సోమ‌వారం మంత్రివ‌ర్గం, అధికారుల‌తో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న అంశంపై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో మంత్రివ‌ర్గం ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌తో సీఎంకు వీడియో ప్రెజెంటేష‌న్ అందించింది. ఇక నేడు మ‌రోసారి స‌మావేశం అవ్వ‌గా అతిత్వ‌ర‌లో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న‌పై క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంది.

Next Story