- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోతుల నాగరాజును గెలిపించాలి.. సీఐటీయూ, హమాలీ వర్కర్స్ యూనియన్
దిశ, కర్నూలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజును గెలిపించాలని సీఐటీయూ, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూల్ నగరంలోని బుధవారపేట 15వ వార్డులో ఎమ్మెల్సీ వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఓల్డ్ సిటీ నగర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్, సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులడు ఆర్.కృష్ణ మాట్లాడుతూ.. కర్నూల్, కడప, అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి పోతులనాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పోతుల నాగరాజు గత 32 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారని, ప్రజా సమస్యల కోసం తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వదులుకున్నారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడే పోతుల నాగరాజు ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షుడు కే రామకృష్ణ, సిఐటియు కమిటీ సభ్యులు జీ రమేష్ బాబు, మహిళా సంఘం నగర ప్రధాన కార్యదర్శి బి.పద్మావతి, సిఐటియు బి.లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.