భక్తులకు గమనిక.. నేటి నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్ల జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-06 02:54:48  IST  )

తిరుమల భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక చేసింది....

భక్తులకు గమనిక.. నేటి నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్ల జారీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) భక్తులకు టీటీడీ(TTD) ముఖ్య గమనిక చేసింది. శ్రీవారి దివ్యదర్శనం టోకెన్ల(Srivari Divya Darshanam Tokens)ను ఇక నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌(Alipiri Bhudevi Complex)లో జారీ చేస్తామని స్పష్టం చేసింది. నిన్నటి వరకూ శ్రీవారి మెట్టువద్ద జారీ చేసిన కౌంటర్లను తాత్కాలికంగా మార్పు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. భక్తులు గందరగోళానికి గురి కాకుండా భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు తీసుకోవాలని సూచించారు. దళారుల దందాకు చెక్ పెట్టేందుకే టోకెన్ కౌంటర్లను మార్పు చేసినట్లు తెలిపారు. టికెట్లను అక్రమంగా అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.

Next Story