భక్తులకు గమనిక... శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-25 14:32:30  IST  )

శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది...

భక్తులకు గమనిక... శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) భక్తుల(Devotees)కు టీటీడీ(TTD) అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 27, 28, 29న శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల(Srivani offline tickets) జారీని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవాణి దర్శన టోకెట్ల కౌంటర్‌తోపాటు, రేణిగుంట ఎయిర్ పోర్టులోనూ శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని, పరిస్థితిని అర్ధం చేసుకుని తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Next Story