Tirumala: పథకాలా.. పాలక మండలి నిర్ణయాలా...!

by Disha Web Desk 16 |
Tirumala: పథకాలా.. పాలక మండలి నిర్ణయాలా...!
X

దిశ, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సభ్యులు సమావేశం అయ్యారు. రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల చేపట్టాలని నిర్ణయించారు. రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్‌విసి ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రూ.1.88 కోట్లతో జిఎన్‌సి, హెచ్‌విసి, ఏఎన్‌సి, ఎస్‌ఎన్‌సి ఉప విచారణ కార్యాలయాల ఆధునీకరణ, అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్‌ ప్యాకేజీకి గాను మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్‌ఎంఎస్‌ సేవలను ముంబయికి చెందిన ఫెసిలిటీ అండ్‌ ప్రాపర్టీ మేనేజర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అందించేందుకు టెండర్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్‌, వకుళామాత విశ్రాంతి గృహం, పిఏసి 3, 4, బి టైప్‌, డి టైప్‌ క్వార్టర్స్‌ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఎస్‌ సేవలను అదే సంస్థకు టెండర్లు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.3.55 కోట్లతో తిరుమలలో పోలీస్‌ క్వార్టర్స్‌ అభివృద్ధికి పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు. రూ.3.10 కోట్లతో తిరుమలలో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చెత్తకుండీల ఏర్పాటుకు పరిపాలన అనుమతులిచ్చారు. రూ.5 కోట్లతో తిరుపతిలోని ఎస్వీ వేద వర్సిటీ ప్రాంగణంలో స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణాన్ని ఆమోదించారు.

మరికొన్ని పాలక మండలి నిర్ణయాలు ఇవే..

  • రూ.7.44 కోట్లతో టీటీడీలోని వివిధ విభాగాల అవసరాల కోసం వర్క్‌లోడ్‌ ప్రకారం కంప్యూటర్లు కొనుగోలుకు నిర్ణయం
  • రూ.9.50 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్‌ రికార్డు స్టోర్‌ నిర్మాణానికి పరిపాలన అనుమతి
  • 2024 సంవత్సరానికి గాను క్యాలెండర్లు, డైరీల ముద్రణకు నిర్ణయం
  • రూ.2 కోట్లతో నగరి సమీపం బుగ్గలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం
  • రూ.4.15 కోట్ల శ్రీవాణి నిధులతో కర్నూలు జిల్లా అవుకు మండలం సీతారామపురంలో శ్రీవారి ఆలయం గోపురాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం
  • స్విమ్స్‌ ఆసుపత్రిలో కార్డియో న్యూరో బ్లాక్‌, సెంట్రలైజ్డ్‌ వంటశాల, సెంట్రలైజ్డ్‌ గోడౌన్‌ నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
  • ఒంటిమిట్టలో రూ.4 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మాణానికి ఆమోదం
  • రూ.6.65 కోట్లతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్కరిణికి ఇత్తడిగ్రిల్స్‌ అమర్చడానికి టెండర్లు ఆమోదం
  • రూ.5.61 కోట్లతో తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆమోదం
  • నంద్యాల జిల్లా యాగంటిలో రూ.2.40 లక్షలతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్


Next Story

Most Viewed