రోజా, అంబటికి ఆర్జీవీ సినిమాలే గతి: కిరణ్ రాయల్

by Disha Web Desk 16 |
రోజా, అంబటికి ఆర్జీవీ సినిమాలే గతి: కిరణ్ రాయల్
X

దిశ, తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉన్నామని తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ వచ్చే రాబోయే ఎన్నికల్లో జనసేన సత్తా చాటి సీఎం కుర్చీని ఆశిస్తామన్నారు. ‘జనసేనాని వ్యూహం మా జనశ్రేణుల బాధ్యత' అనే పోస్టర్‌ను విడుదల చేశారు, ఈ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు పాటిస్తారని వెల్లడించారు.

తమ నాయకుడు పవన్‌పై విమర్శలు చేస్తున్న మంత్రులు రోజా, అంబటి రాంబాబుకు కాలం చెల్లిందని, రానున్న ఎన్నికల తరువాత వీరు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉండాలని విమర్శించారు. ఈ ముగ్గురు జోకర్లకు వైసీపీ ఓటమితో వేరే గత్యంతరం లేదని చురకలంటించారు. జగన్ మెప్పు కోసం పవన్‌ను విమర్శించే ఈ మంత్రులకు తగిన శాస్తి తప్పదన్నారు. ఈ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు బీజేపీ, టీడీపీ, కలిసి వచ్చే ఇతర పార్టీలతో జనసేన పొత్తులతో పాలనలోకి వస్తుందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. జనసేనను విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్‌ను చూస్తే ఎందుకంత భయమని, సింహం సింగిల్‌గా వస్తున్నప్పుడు, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకుంటే పోయేదేముందన్నారు. నోటికొచ్చినట్లు తమ అధినాయకుడును విమర్శిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని రుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి హెచ్చరించారు.



Next Story

Most Viewed