Tirupati: టీటీడీ ఈవో గారూ... మా పాపకు ప్రాణ భిక్ష పెట్టండి!

by Disha Web Desk 16 |
Tirupati: టీటీడీ ఈవో గారూ... మా పాపకు ప్రాణ భిక్ష పెట్టండి!
X

దిశ, తిరుపతి: పుట్టినప్పటి నుండి పాపకు వేస్తున్న టీకాల లోపమో లేక శాపమో తమ కుమార్తె హర్షిత (3) గొంతు ద్వారా వెంటిలేటర్ సపోర్టుతో జీవిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలూరు సీఎంసీ ఆసుపత్రి నందు హర్షిత చికిత్స పొందుతోందని, ఇప్పటికే తమ ఆస్తులన్నీ తాకట్టుపెట్టి 12 లక్షల వరకు ఖర్చు చేశామని చెప్పారు. ఇంకా ఆరు లక్షల రూపాయలు గొంతుకు సంబంధించిన ఆపరేషన్‌కు ఖర్చు అవుతుందని సీఎంసీ వైద్యులు తెలిపారని హర్షిత తల్లిదండ్రులు శివకుమార్, ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేశారు. హర్షితకు సంబంధించిన వెంటిలేటర్ మిషన్‌లను చూపిస్తూ పాప అనారోగ్య స్థితిని తిరుపతి ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం మీడియా ముందు వివరించారు. దాతలు స్పందిస్తే తన బిడ్డ ఆరోగ్యవంతురాలు అవుతుందని, గతంలో చిత్తూరు మీడియా సమావేశంలో అభ్యర్థించినా దాతలు స్పందించలేదన్నారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి‌ని కలిశామని , టీటీడీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నందు చూపెట్టమన్నారని , కానీ అక్కడ తమ పాపకు సంబంధించిన ఆపరేషన్స్ చేసే డాక్టర్లు లేరని విజయవాడకు రెఫర్ చేశారని , కానీ అనారోగ్య రీత్యా పాప ప్రయాణం చేయకూడదని వివరించారు. టీటీడీ యాజమాన్యం స్పందించి సాయం చేస్తే వేలూరు సీఎంసీలో తన బిడ్డకు ఆపరేషన్ జరుగుతుందన్నారు. సాయం చేయాల్సిన దాతలు 8197753717 సెల్ నెంబర్‌కు గాని లేదా యాదమరి , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 423302010078896 IFSC : UBIMO 542334 లకు సాయం చేయాలని వేడుకున్నారు

Next Story

Most Viewed