Tirumala: మార్చి 30, 31న శ్రీరామనవమి ఉత్సవాలు

by Disha Web Desk 16 |
Tirumala: మార్చి 30, 31న శ్రీరామనవమి ఉత్సవాలు
X

దిశ, తిరుపతి: శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 30, 31న టీటీడీ శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానాలు నిర్వహించనుంది. మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్రదీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.


Next Story

Most Viewed