తిరుపతి సీటు కోసం బలిజల పట్టు.. తమ వారికే ఇవ్వాలంటూ డిమాండ్

by Disha Web Desk 16 |
తిరుపతి సీటు కోసం బలిజల పట్టు.. తమ వారికే ఇవ్వాలంటూ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో సీటు తమకే ఇవ్వాలని బలిజలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఏ పార్టీ నుంచైనా తమ సామాజిక వర్గం వారికే సీటు కావాలని పట్టుబడుతున్నారు. బలిజ సేన ఆధ్వర్యంలో మన బలిజ-మన తిరుపతి పేరుతో గురువారం తిరుపతిలో బలిజ నాయకులు రౌండర్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో అన్ని పార్టీలు బలిజ అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. తమ సామాజిక వర్గానికి కాదని ఇతర వర్గాలకు సీట్లు ఇస్తే తాము సహకరించమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఓడిచ్చి తీరుతామని చెబుతున్నారు. కాగా తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బలిజ నాయకులు తిరుపతి సీటు కోసం పట్టుబడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed