తిరుపతి వాసులకు త్వరలోనే శుభవార్త

by Dishafeatures2 |
తిరుపతి వాసులకు త్వరలోనే శుభవార్త
X

దిశ, తిరుపతి: తిరుపతి వాసులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త ప్రకటించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. త్వరలో రేణిగుంట నుంచి అంతర్జాతీయ స్థాయి విమానాలు ఎగురనున్నాయి. మొదట తిరుపతి విమానాశ్రయం నుండి కువైట్‌కు సేవలను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల నిమిత్తం వెళ్లే రాయలసీమ ప్రజలకు తిరుపతి విమానాశ్రయం ఎంతో సౌకర్యంగా ఉంది.భారత్‌లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుపతిలో ఉన్న ప్రముఖ పుణ్య అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. దేశ వ్యాప్తంగా వేలాది భక్తులు.. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు.

ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకు భక్తులు వస్తుంటారు. అయితే భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. పలు రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు తిరుపతికి నిత్యం అందిస్తూ ఉంటాయి. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో తిరుపతిలో ప్రారంభం కానున్నాయి.తిరుపతి విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించింది. అయితే కొన్ని కారణాల వల్ల అంతర్జాతీయ సర్వీసులు టేకాఫ్ కాలేదు. తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం అవుతాయాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తిరుపతి నుండి ప్రపంచ నగరాలకు విమానాలను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థానిక ఎం పి గురుమూర్తి, విమానాశ్రయ అధికారులు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మొదట తిరుపతి విమానాశ్రయం నుండి కువైట్‌కు సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల నిమిత్తం వెళ్లే రాయలసీమ ప్రజలకు తిరుపతి విమానాశ్రయం ఎంతో సౌకర్యంగా ఉంది. అయితే ప్రస్తుతం వీరంతా చెన్నై వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి వస్తోంది.దీంతో అంతర్జాతీయ సర్వీసులు సత్ఫలితాలనిచ్చేలా కేంద్రంతో ఎంపీ గురుమూర్తి సంప్రదింపులు జరుపుతున్నారని, అతి త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు. ఒక వేళ ఇదే జరిగితే తిరుమలకు వచ్చే ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ వార్త పట్ల తిరుమల భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed