తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్ వాడీ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సీఐటీయూఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు....

తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి కలెక్టరేట్(Tirupati Collectorate) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్ వాడీ కార్యకర్తలు(Anganwadai Workers) మెరుపు ధర్నాకు దిగారు. ఈఎస్ఐ(ESI), పీఎఫ్(PF) సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేతలు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి సామాజిక భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందని, తక్షణమే వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

Next Story