Nara Lokesh: ముస్లిం ద్రోహి జగన్..

by Disha Web Desk 16 |
Nara Lokesh: ముస్లిం ద్రోహి జగన్..
X

దిశ, తిరుపతి: ముస్లింలకు గత ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేసేదని, వైసీపీ వచ్చాక రద్దు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు గ్రామంలో యువగళం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను పలువురు ముస్లింలు సోదరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో పెళ్లికానుక కింద రూ.50 వేలు ఇచ్చేవారని, అధికారంలోకి వస్తే లక్ష చేస్తానని చెప్పి వైఎస్ జగన్ మోసం చేశారని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ముస్లింలు నమాజ్ చేసుకోవాలంటే 7కి.మీ వెళ్లాల్సి వస్తోందని, మసీదు నిర్మించాలని కోరారు. కుల్లూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాడు తవ్వించిన చెరువు చుట్టూ ముళ్లపొదలతో నిండిపోయిందని, శుభ్రపర్చాలనిలోకేశ్‌కు స్థానిక ముస్లింలు చెప్పుకున్నారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ ముస్లిం కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి అని విమర్శించారు. జగన్‌కు ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు. ముస్లింల కోసం ఖర్చు చేయాల్సిన 5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో వైసీపీ నేతలు దారుణంగా నరికి చంపారని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన రంజాన్, దుల్హాన్, విదేశీ విద్య వంటి పథకాలను ఎటువంటి కొర్రీలు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. కుల్లూరులో మసీదు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed