Srikalahasti: ఇక నుంచి రూ.500కే అంతరాలయ దర్శనం

by Disha Web Desk 16 |
Srikalahasti: ఇక నుంచి రూ.500కే అంతరాలయ దర్శనం
X

దిశ, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఇకపై అంతరాలయ దర్శనం చేసుకోడానికి రూ.500 టికెట్‌ను ప్రవేశ పెట్టాలని ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో 48 అంశాలకు ఆమోదం తెలిపారు. అనంతరం అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సలహాలు సూచనలతో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అంతరాలయ దర్శనానికి 500 రూపాయలతో టికెట్ పెట్టనున్నట్లు వెల్లడించారు. స్థానిక భక్తులకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అంతరాలయ దర్శనం త్వరలో అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. సువర్ణముఖి నదిని పవిత్రంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నది మురుగు నీటిని పైప్ లైన్ ద్వారా తరలించే పథకానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రోటోకాల్ విఐపిలకు నిర్దిష్ట సమయంలో దర్శనం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయంలో లీకేజీ నివారణకు సంబంధించి మూడు కోట్లతో లీకేజీ నివారణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దాతల సహకారంతో ఈ పనులు చేయనున్నట్లు తెలిపారు.


రామసేతు వంతెన కొత్త బ్రిడ్జి మధ్య ఖాళీ స్థలంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని, సీడ్స్ సర్కిల్లో ధ్యానమూర్తి శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణం పట్టణంలో కనిపించే చర్యలు చేపడుతున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఆదికాలంలో ఉన్న గురు దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాల పునర్ధరణ చేయడంపై చర్చించినట్లు తెలిపారు. ఇష్టానుసారం చేసే అంతర్గత బదిలీలతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నందున ఆలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ధర్మకర్తల మండలి అనుమతితో మాత్రమే చేయాలని తీర్మానించామన్నారు. ప్రముఖుల ఆశీర్వాదంకు ఇకపై ప్రత్యేకంగా ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ లైట్లు ఏర్పాటు, ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం తదితర అంశాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నిత్య అన్నదాన మండపంపై మరో సెల్లార్ ఏర్పాటు చేసి 1000 మందికి అన్నదానం చేసేలా చేస్తామన్నారు. అమ్మవారి నెప్పాల మండపం పునర్నిర్మాణం చేయనున్నట్లు తారక శ్రీనివాసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed