Tirupati: టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం

by Disha Web Desk 16 |
Tirupati: టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం
X

దిశ, తిరుపతి: రష్యాకు చెందిన అచ్యుత మాధవ దాసు అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గురువారం రూ.7 లక్షల 64 వేలు విరాళంగా అందించారు. దాత తరపున ఆయన స్నేహితుడు శ్రీ కృష్ణ కన్నయ్య దాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డికి విరాళం డీడీలను అందజేశారు. ఇందులో ఎస్వీబీసీ ట్రస్ట్‌కు రూ 1 లక్ష 64 వేలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేద పారాయణ ట్రస్టు‌, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.


Next Story

Most Viewed