Tirupati: ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. కోటి విలువైన దుంగల గుర్తింపు

by Disha Web Desk 16 |
Tirupati: ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. కోటి విలువైన దుంగల గుర్తింపు
X

దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఉస్తికాయలపెంట -ఎల్లమంద క్రాస్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. రెండు బైకులు, రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ షేక్ షేపులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పారిపోయారు. పట్టుబడ్డ నిందితుడు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా, ఉత్తన్ గారైకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రిమాండ్‌కు తరలించారు. ఎర్రచందనం పరిరక్షణ అందరి బాధ్యత అని, అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు.

Next Story

Most Viewed