తిరుపతిలో దారుణం.. తాళి బొట్టు తెంపి నవ దంపతులపై దాడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-24 11:13:47  IST  )

ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ నవదంపతులపై యువతి బంధువులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. రక్షణ కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో దారిలోనే వారిని అడ్డుకున్న బంధువులు దాడికి తెగబడ్డారు.

తిరుపతిలో దారుణం.. తాళి బొట్టు తెంపి నవ దంపతులపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ నవదంపతులపై యువతి బంధువులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. రక్షణ కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో దారిలోనే వారిని అడ్డుకున్న బంధువులు దాడికి తెగబడ్డారు. అంతేకాదు యువతి మెడలోని తాళిబొట్టును సైతం తెంచివేసి, నవవరుడు చందుపై దారుణంగా భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఊహించని ఈ దాడితో తీవ్ర భయాందోళనకు గురైన ఆ నవదంపతులు, ప్రాణభయంతో వెంటనే సమీపంలోని ఒక కార్యాలయంలోకి పరుగులు తీసి దాక్కున్నారు.

స్థానికుల సాయంతో ఎట్టకేలకు ఆ దాడి నుంచి బయటపడిన దంపతులు, జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు బాధిత దంపతులకు తగిన రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

Next Story