సామాన్యుల్లా చంద్రబాబు, నారా లోకేశ్ భోజనం.. నెట్టింట్లో ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-24 11:56:10  IST  )

విద్యార్థుల మధ్య సామాన్యుల్లా కూర్చుని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భోజనం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో ఇద్దరూ పాల్గొన్నారు...

సామాన్యుల్లా చంద్రబాబు, నారా లోకేశ్ భోజనం.. నెట్టింట్లో ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల మధ్య సామాన్యుల్లా కూర్చుని సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) భోజనం(Meals) చేశారు. పోలవరం జిల్లా(Polavaram District) రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల(Rampachodavaram Government School)లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం తిన్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలో పెట్టిన మధ్నాహ్న భోజనాన్ని రుచి చూశారు. భోజనం ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అంతపెద్ద హోదా ఉండి కూడా సామాన్యుల్లా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్యాహ్నం భోజనం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. రాష్ట్ర విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను కొనియాడారు.

Next Story