Tirupati: ఈ 26న కిసాన్ మోర్చా ధర్నా..

by Disha Web Desk 16 |
Tirupati: ఈ 26న కిసాన్ మోర్చా ధర్నా..
X

దిశ, తిరుపతి: తిరుపతి జిల్లాలో నాలుగు చక్కెర కర్మాగారాలను మూసివేయడంతో చెరుకు రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని నేతాజీ చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణస్వామి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు సంఘం సభ్యులు హరిబాబు చౌదరి, నాగిరెడ్డి, పట్టాభిరెడ్డి తదితరులతో కలిసి నారాయణ స్వామి ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర చక్కెర ఫ్యాక్టరీ చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 26న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నిండ్ర గ్రామంలోని షుగర్స్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు నారాయణ స్వామి రెడ్డి వెల్లడించారు..



Next Story

Most Viewed