- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నెల్లూరు నుంచే పతనం మొదలైంది.. జగన్కు Nara Lokesh హెచ్చరిక
దిశ, తిరుపతి: జగన్ పతనం నెల్లూరు నుంచే మొదలయిందని నారా లోకేశ్ అన్నారు. పలమనేరులో లోకేశ్ 'యువగళం' పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్పై లోకేశ్ నిప్పులు చెరిగారు. యుద్ధం మొదలైందని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నలభై ఐదేళ్లకే పెన్షన్ అంటూ మహిళలను జగన్ మోసం చేశారని గుర్తు చేశారు. జగన్ ఇచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిత్యావసరాలు, డీజిల్, పెట్రోలు ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారని నారా లోకేశ్ విమర్శించారు.
రాయలసీమ బిడ్డవేనా?
బూమ్ బూబ్ బీర్ మాత్రమే పొలాలకు పని చేస్తున్నాయని, పురుగు మందులు పని చేయడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. అసలు నువ్వు రాయలసీమ బిడ్డవేనా? అని జగన్ను ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానానికి చేరుకుందని విమర్శించారు. జగన్ జిల్లాకో రౌడీని తయారు చేశాడని, చిత్తూరు జిల్లా రౌడీ పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇసుక ద్వారా వేల కోట్లు దోచుకుంటున్నాడని నారా లోకేశ్ ధ్వజమెత్తాడు.
ఇవి కూడా చదవండి: