Kuppamలో కూడా Tdp జెండా పీకేస్తాం!

by Disha Web Desk 16 |
Kuppamలో కూడా Tdp జెండా పీకేస్తాం!
X

దిశ , పుంగనూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కన్నా జగన్ చేసిందే ఎక్కువగా ఉందన్నారు. ముఖ్య మంత్రి సహాయంతో కుప్పం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని, అందుకే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

పండుగ రోజు కూడా చంద్రబాబు సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్‌పై చంద్రబాబు ఏడుపు కొనసాగుతోందని మండిపడ్డారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చంద్రబాబు మర్చిపోయాడన్నారు. చిత్తూరు జిల్లా నుంచి సీఎం అయిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని మంత్రి పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీని అడ్డు పెట్టుకొని చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు గూండాయిజం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన శక్తి ఏంటో తెలుసుకొని మాట్లాడాలన్నారు. జగన్ సీఎం అయ్యాకా చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీని నామరూపాలు లేకుండా చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పాన్ని అభివృద్థి చేయని వ్యక్తి చంద్రబాబు అని పెద్దిరెడ్డి ఆరోపించారు.

కారుకూతలు కూస్తే సహించేందుకు సిద్ధంగా లేమని పెద్దిరెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు భారమో, తాను భారమో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాతో చంద్రబాబుకు సంబంధమే లేదన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కల్యాణ్ వెళ్తున్నాడని, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా అని పెద్ది రెడ్డి నిలదీశారు. భోగి మంటల్లో కాల్చాల్సింది జీవో నెం.1ను కాదని, సీఎం కావాలనే తాపత్రయాన్ని కాల్చుకోవాలన్నారు. కేఏ పాల్ తరహాలో చంద్రబాబు కలలు కంటున్నాడని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed