Punganur: వారంతా చంద్రబాబు కోవర్టులే.. బీజేపీ నాయకులపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

by Disha Web Desk 16 |
Punganur: వారంతా చంద్రబాబు కోవర్టులే.. బీజేపీ నాయకులపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
X

దిశ, పుంగనూరు: బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్టులే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ, బిసి, క్రిస్టియన్, మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్ళందరూ కలుస్తున్నారని విమర్శించారు. పేదలకు మంచి చేసినందుకు అవినీతి ప్రభుత్వం అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మాత్రమే అవినీతి జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. వైసీపీకి అవినీతిని అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25 ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి భారీ విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు.. అమిత్ షాకు మంత్రి అమర్‌నాథ్ సూటి ప్రశ్న

Amaravati: తెలంగాణపై పవన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం



Next Story

Most Viewed