Renigunta: మొబైల్ షాప్ యజమాని ఆత్మహత్య

by Disha Web Desk 16 |
Renigunta: మొబైల్ షాప్ యజమాని ఆత్మహత్య
X

దిశ, రేణిగుంట: రేణిగుంట తూకివాకం చెరువు వద్ద పురుగుల మందు తాగి శ్రావణ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రావణ్ రేణిగుంటలో మొబైల్ షాప్ మొబైల్ షాప్‌తో పాటు షేర్ మార్కెటింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. శ్రావణ్‌ది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రావణ్ భార్య సీఆర్ఎస్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. ఏమైందో ఏమోగాని శుక్రవారం ఉదయం తూకివాకం చెరువు వద్ద శ్రావణ్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని గాజులమండ్యం పోలీసులు పరిశీలించారు. శ్రావణ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed