తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

by Thanuru Gopichand |

తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (koyil Alwar Tirumanjanam) చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని (Sacred Water) ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

10 పరదాలు అమ్మవారికి బహుకరణ

హైదరాబాద్ కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను, అదేవిధంగా తిరుపతికి చెందిన మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామికి అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో (Sanctrum Sanctorium) పరదాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ (TTD) జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆలయ ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో ఎం. రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు త‌దితరులు పాల్గొన్నారు.

Next Story