12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే..?

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది...

12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వారంతం కావడంతో భక్తులు(Devotees) కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,954 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకతో హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story