తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం గాదంకిలో లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. యాదమర్రికి చెందిన గ్రామస్తులు ఆటోలో బయల్దేరారు..

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Horrific road accident) జరిగింది. పాకాల మండలం గాదంకిలో లారీ(Lorry)ని ఆటో(Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. యాదమర్రికి చెందిన గ్రామస్తులు ఆటోలో బయల్దేరారు. గాదంకిలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.

Next Story