Tirumala: తిరుమలేశుడికి రూ. కోటి విరాళం

by Disha Web Desk 16 |
Tirumala: తిరుమలేశుడికి రూ. కోటి విరాళం
X

దిశ, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదాని ట్రస్టుకు విరాళంగా రూ.కోటి అందజేశారు. హైదరాబాదుకు చెందిన సరోజినీ వడ్లమూడి అనే భక్తురాలు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం ఆమెకు స్వామివారి దర్శనం కల్పించిన తరువాత ప్రసాదాలను అందజేశారు.


Next Story