- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tirupatiలో 7 వేల దొంగ ఓట్లు.. కోర్టుకు వెళ్తామని నారాయణ హెచ్చరిక
by Disha Web Desk 16 |
X
దిశ, తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో 7 వేల నకిలీ ఓట్లు నమోదు చేశారని మండిపడ్డారు. తిరుపతి యశోదనగర్లో ఓ చిన్న ఇంట్లో 11 గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. ఓ మహిళకు 25 మంది భర్తలు ఉన్నట్లు ఓటర్ లిస్టులో ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ బరితెగించిందని ఆయన ఆరోపించారు. చదువు రాని వారిని వేలాది మందిని గ్రాడ్యుయేషన్లో చేర్చడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల నమోదుపై కోర్టుకు వెళ్తామని నారాయణ హెచ్చరించారు.
Next Story