అమ్మవారి సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

by Disha Web Desk 18 |
అమ్మవారి సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
X

దిశ,తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద జె.ఈ.ఓ. వీరబ్రహ్మం, వి.జి. ఓ. బాలిరెడ్డి డిప్యూటీ ఈఓ,గోవింద రాజన్, ఏఈఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబు స్వామి, శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ లు శేషగిరి, చంద్రశేఖర్, ఏవీఎస్‌వో సతీష్ కుమార్, వి.ఐ. ప్రతాప్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, భాస్కర్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ధ్వజ స్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More..

Ap Politics: పాలకొల్లులో చంద్రబాబు బస వద్ద ఉండి కార్యకర్తల ఆందోళన


Next Story

Most Viewed